అమరావతి, 06( హిం.స): స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్కు బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్ చైర్మన్గా టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం ఉన్నారు. తాజాగా డైరెక్టర్లుగా ఆరుద్ర భూలక్ష్మి(మంగళగిరి), బొమ్మనయూని లక్ష్మణరావు(పార్వతీపురం), ఎం.నాగలక్ష్మి (విశాఖపట్నం), మువ్వాల వెంకటరమణ, ఎన్.పర్వీన్ బాను(కదిరి), బోలెం నాగమణి (అవనిగడ్డ), పరుచూరి భావని రవికుమార్(అనంతపురం), సలాది పట్టాభిరామయ్య(రామచంద్రపురం), బుచ్చ రాము (విశాఖపట్నం దక్షిణ), రెడ్డివారి మంజునాధ్ (పెనుకొండ), సానారెడ్డి కల్పనారెడ్డి(సర్వేపల్లి), చిన్ని శ్రీనివాసరావు(అద్దంకి), టంగుటూరి నాగమ్మ(తాడిపత్రి), కూచిపూడి ఉదయ భాస్కర్(గోపాలపురం)లను నియమిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ