శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… రేపటి నుండి తిరుపతి ఆలయం మూసివేత.! దర్శనం మళ్ళీ ఎప్పుడంటే..
తిరుమల, 6 సెప్టెంబర్ (హి.స.)తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. (రేపు) సెప్టెంబర్ 6 నుంచి 7 తేదీలలో శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయం మూసివేయబడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివరాలు వ
తిరుమల


తిరుమల, 6 సెప్టెంబర్ (హి.స.)తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ముఖ్యమైన సమాచారం.

(రేపు) సెప్టెంబర్ 6 నుంచి 7 తేదీలలో శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయం మూసివేయబడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివరాలు వెల్లడించింది.

రేపు సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయం 12 గంటల పాటు మూసివేయబడుతుంది. ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయబడతాయి.

సోమవారం ఉదయం 6 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు మూసివేయబడతాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుండి అన్నప్రసాద పంపిణీ తిరిగి ప్రారంభమవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande