
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)
రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే నీ జేజమ్మ వల్ల కూడా కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేసే సోయి కాంగ్రెస్కు లేదని మధుసూదనాచారి విమర్శించారు. జిల్లాలను ఆగం చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రెండేళ్లయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట ఇచ్చేటప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కనబడతారని.. మాట నిలబెట్టుకోవాలని అడిగితే పోలీసులు ప్రత్యక్షమవుతారని అన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానిది దుర్మార్గమైన వైఖరిని అని విమర్శించారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..