నేడు శబరిమల మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివచ్చిన భక్తులు
కేరళ, 14 జనవరి (హి.స.) శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ''మకరవిలక్కు'' (మకరజ్యోతి) దర్శనానికి సమయం ఆసన్నమైంది. పొన్నంబలమేడు ఇవాళ సాయంత్రం పై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులార
శబరిమల


కేరళ, 14 జనవరి (హి.స.)

శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన 'మకరవిలక్కు' (మకరజ్యోతి) దర్శనానికి సమయం ఆసన్నమైంది. పొన్నంబలమేడు ఇవాళ సాయంత్రం పై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం, పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది. సాయంత్రం సుమారు 6:30 నుంచి 6:45 మధ్య ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande