
తిరుమల, 14 జనవరి (హి.స.)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు అందరూ సొంతూళ్లకు చేరుకోవడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి స్వల్పంగా తగ్గింది. బుధవారం ఉదయానికి ఉచిత దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే టోకెన్లు పొందిన భక్తులకు సర్వదర్శనానికి 2-4 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 1-3 గంటల సమయం పడుతుంది. మంగళవారం 73,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 19,639 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV