
హైదరాబాద్, 15 జనవరి (హి.స.)
సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో
సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జోరుగా సాగుతోంది. జనవరి 13 నుంచి 15 వరకు జరుగుతున్న ఈ ఫెస్టివల్ను తెలంగాణ పర్యాటక శాఖ, ప్రైవేట్ స్పాన్సర్లు కలిసి నిర్వహిస్తున్నారు. 19 దేశాల నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత పతంగుల కళాకారులు రంగురంగుల, భారీ పతంగులను ఎగురవేస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. భారత్తో పాటు చైనా, జపాన్, థాయ్లాండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన డ్రాగన్, ఈగిల్, బటరై, ఫిష్ ఆకృతుల పతంగులు, 50 నుంచి 100 అడుగుల పొడవైన పతంగులు, LED లైట్స్తో నైట్ కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..