ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు... విమానాలు, రైళ్లు ఆలస్యం
ఢిల్లీ, 18 జనవరి (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలను (NCR) దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు సున్నాకు పడిప
ఢిల్లీ


ఢిల్లీ, 18 జనవరి (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలను (NCR) దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు సున్నాకు పడిపోవడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

ఆదివారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) 437గా నమోదైంది. మరోవైపు, కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. శనివారం నుంచే ఈ పరిస్థితి ఉండగా, ఆదివారం నాటికి మరింత దిగజారింది. రానున్న రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ విమాన వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.

వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) వెంటనే గ్రాప్-4 (GRAP-IV) ఆంక్షలను తిరిగి అమలులోకి తెచ్చింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ కఠిన నిబంధనలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande