
అమరావతి, 23 ఫిబ్రవరి (హి.స.)ఏపీ అసెంబ్లీ(Ap Assembly) రేపటికి వాయిదా(Adjournment) పడింది. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఉభయసభలు ఆసక్తికరంగా జరిగాయి. ప్రధానంగా ప్రజా సమస్యలు, పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనులపై సభ్యులు వాడీవేడీగా చర్చించారు. మొత్తం గంటలపాటు ప్రశ్నోత్తరాలు జరిగాయి. భారీ వర్షాలు, తుఫాను నష్టం, రైతుల పరిహారంపై సభ్యులు చర్చించారు. కేజీబీవీ పాఠశాల నిర్వహణ(KGBV School Management), విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల బకాయిలు, చీరాల వస్త్ర పరిశ్రమ సమస్యలు, విజయనగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, యనమదుర్రు డ్రైన్ ఆధునీకరణ పనులు, అవ్యవస్థీకృత కార్మికుల సంక్షేమం వంటి పథకాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరికి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV