
అమరావతి, 13 మార్చి (హి.స.)
, :రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అమరావతిలోని సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కలిశారు. గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై చర్చించారు.
హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన విన్నపాలు:
విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్యాస్ పొదుపు కోసం తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ పలు ప్రతిపాదనలు మంత్రి ముందు ఉంచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ