నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం..
నల్గొండ, 15 మార్చి (హి.స.) నల్గొండ జిల్లాలో నేటి మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. కాగా ఈ ఘోర ప్రమాదంలో ఆటోలో ప్రయా
Road accident


నల్గొండ, 15 మార్చి (హి.స.)

నల్గొండ జిల్లాలో నేటి మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. కాగా ఈ ఘోర

ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande