
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)మొయినాబాద్ డ్రగ్స్ కేసు తీవ్ర చర్చనీయాంశమైన వేళ టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ టెస్టుకు కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధమని చెప్పారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నేతకు డ్రగ్ టెస్టులు జరగాలన్నారు. ‘‘డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ రావాలి. సీఎంనూ తీసుకువస్తా. సభ్యులందరం డ్రగ్ టెస్టు చేయించుకుందాం. సమాజానికి మంచి సందేశం ఇద్దాం’’ అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్