రాజ్యసభకు నితిన్, నీతీశ్ ఎన్నిక
పట్నా:ఢిల్లీ, 17,మార్చి (హి.స.) భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారితోపాటు మరో ముగ్గురు బిహార్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఒడిశాలో క్రాస్ ఓటింగ్ ద్వారా మూడో స్థానాన్నీ ఎన్డ
nitin nabin


పట్నా:ఢిల్లీ, 17,మార్చి (హి.స.) భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారితోపాటు మరో ముగ్గురు బిహార్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఒడిశాలో క్రాస్ ఓటింగ్ ద్వారా మూడో స్థానాన్నీ ఎన్డీయే గెలుచుకుంది. హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోయింది. దీంతో అక్కడి 2 స్థానాలకు జరిగిన ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

బిహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో నితిన్, నీతీశ్తోపాటు కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకుర్ (జేడీయూ), శివేశ్ కుమార్ (భాజపా), ఉపేంద్ర కుశ్వాహా (రాష్ట్రీయ లోక్ మోర్చా) ఉన్నారు. సోమవారం ఈ ఐదుగురి ఎన్నికను విధానసభ కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖ్యాతి సింగ్ ప్రకటించారు. వాస్తవానికి బిహార్లో నలుగురు సభ్యులు ఎన్నిక కావడానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఐదో అభ్యర్థికి కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి. దీంతో ప్రతిపక్షం ఆర్జేడీ.. అమరేంద్ర ధారి సింగ్ను బరిలోకి దింపింది. అయితే ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులంతా విజయం సాధించారు. కాంగ్రెస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు

4

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande