ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్ మరియు సీఎం
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పరాభవనామ ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, జీవితంలోని కష్టసుఖాలను, సవాళ్లను ఆశావాద దృక్పథంతో స్వీకరించ
Governor


హైదరాబాద్, 19 మార్చి (హి.స.)

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పరాభవనామ ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, జీవితంలోని కష్టసుఖాలను, సవాళ్లను ఆశావాద దృక్పథంతో స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం, అదృష్టం తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ప్రతి సంవత్సరం కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగే సమయమే ఉగాది అని, ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని పేర్కొన్నారు. గతాన్ని పాఠంగా తీసుకుని భవిష్యత్తును మరింత వెలుగొందించేలా ముందుకు సాగాలని, కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

రైతులు, కార్మికులు, మహిళలు, యువత ప్రతి వర్గం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని, రైతులే దేశానికి వెన్నెముక అంటూ మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని ఆశించారు. సంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పండుగలను జరుపుకోవాలని, ఉగాది పచ్చడి జీవితానికి అన్ని రుచులను సూచిస్తుందని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నింపాలని, రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande