ఈద్ ముబారక్: దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు.. మసీదులు, ఈద్గాల వద్ద మార్మోగుతున్న ప్రార్థనలు
ఢిల్లీ, 21 మార్చి (హి.స.)దేశమంతా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర మాసంలో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) ముగించుకుని, నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా
eid-mubarak-ramadan-celebrations-across-the-country-prayers-a


ఢిల్లీ, 21 మార్చి (హి.స.)దేశమంతా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర మాసంలో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు (రోజా) ముగించుకుని, నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు వేల సంఖ్యలో చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి, అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది.

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక జామా మసీదు, ఫతేపురి మసీదుల వద్ద భక్తులు భారీ సంఖ్యలో నమాజ్ ఆచరించారు. ఈ సందర్భంగా జామా మసీదు వద్ద చిన్నపిల్లలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజస్థాన్ స్టే్ట్ అజ్మీర్లోని ప్రసిద్ధ ‘ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా షరీఫ్’ వద్దకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పండుగ సందర్భంగా ఉదయం 5 గంటలకే దర్గాలోని పవిత్ర ‘జన్నతి దర్వాజా’ను భక్తుల దర్శనార్థం తెరిచారు. మహారాష్ట్ర స్టేట్ ముంబైలోని ప్రసిద్ధ మహిమ్ దర్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తమిళనాడు స్టేట్ తిరుచిరాపల్లిలో ముస్లింలు భారీ సంఖ్యలో ఒకే చోట చేరి నమాజ్ చేశారు. అలాగే, కోయంబత్తూరులోని కరుంబుక్కడైలో ఉన్న ఇస్లామియా మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆవరణలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రార్థనలు ఆచరించారు.

రంజాన్ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ బలగాలు, నిఘా బృందాలు, సైబర్ టీమ్లతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande