శ్రీరామనవమి రోజే కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘తెలంగాణ ప్రజా జాగృతి'కి ముహూర్తం ఖరారు!
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అం
Jagruti Kavita


హైదరాబాద్, 25 మార్చి (హి.స.) తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు ಆಮ కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత తన పార్టీకి 'తెలంగాణ ప్రజా జాగృతి ' (Telangana Praja Jagruthi) అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి (Registration) దరఖాస్తు చేయగా, దీనిపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానుందని సమాచారం.

తన మెట్టినిల్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా, గుర్తు, పార్టీ విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పని చేయనుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగ కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామ నవమి రోజే ప్రకటించే చాన్స్ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande