భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల.. రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం
తిరుమల, 25 మార్చి (హి.స.) కలియుగ ఇలవైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల వరకూ 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలి
తిరుమ‌ల‌


తిరుమల, 25 మార్చి (హి.స.)

కలియుగ ఇలవైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల వరకూ 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4-6 గంటలు, రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,381 మంది భక్తులు దర్శించుకోగా.. 25,451 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం.. రికార్డుస్థాయిలో రూ.4.46 కోట్లు సమకూరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande