
అమరావతి, 26 మార్చి (హి.స.)
: గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) సభ్య కార్యదర్శిగా అఖిలేశ్ కుమార్ ఝాను నియమిస్తూ కేంద్ర జల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం కార్యదర్శి జితేంద్ర కుమార్ ఉత్తర్వులిచ్చారు. కేంద్ర జలశక్తి మం త్రిత్వ శాఖ పరిధిలో పలువురు ఇంజనీర్లను బదలీ చేశారు. కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో) సీఈగా ఓఆర్కే రెడ్డిని నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ