రేపు సెలవు.. వారికి అలర్ట్!
అమరావతి, 26 మార్చి (హి.స.) : శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం అన్ని స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు, బ్యాంకులకు రేపు హా
రేపు సెలవు.. వారికి అలర్ట్!


అమరావతి, 26 మార్చి (హి.స.) : శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం అన్ని స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు, బ్యాంకులకు రేపు హాలిడే ఉండగా.. అన్ని కార్యాలయాలు మూతపడనున్నాయి. తెలంగాణలోని భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణయోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతుండగా.. అటు ఏపీలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. కాగా 28న శుక్రవారం శ్రీరామనవమి సెలవు కాగా, 29న 4వ శనివారం, 30న ఆదివారం సెలవుతో అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. కాగా వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో బ్యాంకు పనులువుంటే వినియోగదారులు ఈరోజే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande