అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్
అమరావతి, 27 మార్చి (హి.స.) శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన సందేశం ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరామ
జగన్


అమరావతి, 27 మార్చి (హి.స.)

శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన సందేశం ఇచ్చారు.

ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు అని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

-

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande