
అమరావతి, 29 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు. అమరావతికి 2015లో మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్షాకు గుర్తుచేసినట్టు వెంకయ్య తెలిపారు.
అమరావతి అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం కూడా చేసిందని, భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని హోంమంత్రి అమిత్ షా కి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని వెంకయ్య నాయుడు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయని, కేబినెట్లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలిందని అమిత్ షా చెప్పినట్టు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్