గంగమ్మ జాతరలో విషాదం.. ఇద్దరు మృతి
కురబలకోట, 08 మార్చి (హి.స.)అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో జరుగుతున్న గంగమ్మ జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించారు. ఇద్దరూ రేకులషెడ్డులో ఉన్న ఇనుప ఊయలపై ఊగుతుండగా ఈ ఘ
గంగమ్మ జాతరలో విషాదం.. ఇద్దరు మృతి


కురబలకోట, 08 మార్చి (హి.స.)అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో జరుగుతున్న గంగమ్మ జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించారు. ఇద్దరూ రేకులషెడ్డులో ఉన్న ఇనుప ఊయలపై ఊగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఊయలకు కరెంట్ పాస్ అవ్వడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ముదివేడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమా ? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతరలో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ కనెక్షన్లలో లోపాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande