లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడానికి పూర్తి బాధ్యత బీజేపీదే: కేటీఆర్
లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడానికి పూర్తి బాధ్యత బీజేపీదే: కేటీఆర్
ktr


హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పన్నిన కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు వెంటనే దక్కకుండా పోయాయని మండిపడ్డారు.

బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినప్పటికీ, బీజేపీ కావాలనే డీలిమిటేషన్ పేరుతో చిక్కుముళ్లు తెచ్చిపెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసిందని ఆరోపించారు. మహిళా సాధికారతపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి నేటి పరిణామాలతో తేలిపోయిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అనవసరంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంతో ముడిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.

ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదని, కానీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దేశ మహిళల భుజాల మీద నుంచి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసిందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande