తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమన్నా
తిరుమల , 19 ఏప్రిల్ (హి.స.)ప్రముఖ నటి తమన్నా ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తన తిరుమల పర్యటనకు సం
tamannaah-visits-tirumala-temple-seeks-blessings


తిరుమల , 19 ఏప్రిల్ (హి.స.)ప్రముఖ నటి తమన్నా ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోను తమన్నా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఆమె గులాబీ రంగు సంప్రదాయ దుస్తులు, ఎరుపు రంగు దుపట్టాతో ఆలయం వెలుపల తోటి భక్తులతో కలిసి కనిపించారు. అంతకుముందు, తిరుమలకు కారులో ప్రయాణిస్తున్న వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. తమన్నాను చూసిన పలువురు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

ఇక సినిమాల విషయానికొస్తే, తమన్నా ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె తొలిసారి నటిస్తున్న 'వివన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' చిత్రం మే 15న థియేటర్లలో విడుదల కానుంది. దీనితో పాటు, శశాంక ఘోష్ దర్శకత్వంలో వస్తున్న 'రాగిణి 3' చిత్రంలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా నటిస్తుండటం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande