రామగుండంలో భానుడి భగ భగ.. 45°C నుంచి 47°C ఉష్ణోగ్రతల నమోదు
రామగుండంలో భానుడి భగ భగ.. 45°C నుంచి 47°C ఉష్ణోగ్రతల నమోదు
Temperature


పెద్దపల్లి, 28 ఏప్రిల్ (హి.స.)

పెద్దపల్లి జిల్లా రామగుండంలో భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. తాజా వాతావరణ సమాచారం ప్రకారం.. మంగళవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45°C నుంచి 47°C వరకు నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా, వాతావరణ శాఖ రామగుండం ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వేడి గాలులు ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్న సమయానికి వడగాల్పులు వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.

భగ భగ మండే ఎండకు జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రాంతంలో సాధారణంగానే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలలో ఒకటి. గత ఏడాది మే నెలలో ఇక్కడ గరిష్టంగా 46°C ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ప్రజలు ఎండ బారి నుంచి కాపాడుకోవడానికి, వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖ అధికారుల లెక్క ప్రకారం..రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏప్రిల్ 2026 నాటి సమాచారం ప్రకారం, రామగుండంలో భానుడి ప్రతాపం తీవ్రస్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఎండలు ముందే దంచికొడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande