
కర్నూలు, 03 ఏప్రిల్ (హి.స.)బొప్పాయిలోని పోషకాలు అనేక వ్యాధులను కూడా నివారించగలవు. ఈ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనప్పటికీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారి ఆరోగ్యానికి బొప్పాయి అంత మంచిది కాదు. అంటే బొప్పాయి అందరికీ ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చదన్నమాట. కాబట్టి బొప్పాయి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సీ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా లైకోపీన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో, కణాలను సురక్షితంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అదనంగా పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆహారం జీర్ణమవడంలో సహకరించడమే కాకుండా కడుపు తేలికగా అనిపించేలా చేస్తుంది.
బొప్పాయిలో విటమిన్ సీ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే వారికీ ఇది సహజ రక్షణ కవచంలా పని చేస్తుంది. బొప్పాయి లోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ వ్యాధుల నుండి రక్షించగలవు.
గుండె ఆరోగ్యం కాపాడుకోవాలనుకునే వారికి కూడా బొప్పాయి ఒక మంచి పండు. ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు సమస్యలున్న వారికి ఇది సహజ సహాయకంగా ఉంటుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గడంతో గుండె సజావుగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది.
కళ్లను రక్షించడంలో కూడా బొప్పాయి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసుతో వచ్చే కంటి సమస్యలను ఆలస్యం చేయడంలో ఇది సహాయపడుతుంది.
రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మరింత సులభంగా జరుగుతుంది. భోజనం చేసిన తరువాత ఒక చిన్న గిన్నెడు బొప్పాయి తినడం వల్ల ఆహారం కడుపులో సులువుగా జీర్ణమవుతుంది. కడుపు బరువుగా అనిపించకుండా తేలికగా ఉండేలా చేస్తుంది. దీని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV