
అమరావతి, 10 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) చైర్మన్గా ప్రముఖ సినీ పంపిణీదారుడు, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ పి. భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. భరత్ భూషణ్కు బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. అందరినీ కలుపుకుంటూ రాష్ట్రంలో సినీ, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
భరత్ భూషణ్ కి సినీ ఇండస్ట్రీతో విడదీయలేని అనుబంధం ఉంది. గత 20 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూ ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. కేవలం బిజినెస్కే పరిమితం కాకుండా, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉండి సినీ కార్మికుల సమస్యలను, డిస్ట్రిబ్యూటర్ల ఇబ్బందులను తీర్చడంలో ముందున్నారు. ఆయన సేవలను గుర్తించి ఇటీవల ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆయనకు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడంపై ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ