
మదనపల్లె, 10 మే (హి.స.)
అన్నమయ్య జిల్లా మదనపల్లె బైపాస్లోని రాయల్ ఉడ్ వద్ద బోయకొండ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుల ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొంది. ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన 16 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 60 మంది భక్తులు ఐచర్తో పాటు బొలెరోలో బోయకొండకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV