
అనంతపురం , 12 మే (హి.స.)ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనంతపురం చేరుకున్నారు.
కలెక్టర్ ఆనంద్ ఆయనకు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం, కలెక్టర్ రెవెన్యూ భవనంలో కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులతో జరిగిన వినతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV