కుప్పం గంగమ్మకు పట్టువస్త్రాలు.. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు!
కుప్పం గంగమ్మకు పట్టువస్త్రాలు.. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు!
కుప్పం గంగమ్మకు పట్టువస్త్రాలు.. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు!


కుప్పం, 13 మే (హి.స.)

కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం రానున్నారు. ఈ నెల 20న సీఎం చంద్రబాబు దంపతులు గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. జాతరలో భాగంగా విశ్వరూప దర్శనానికి సీఎం దంపతులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు.

తిరుపతి గంగమ్మ జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున . భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు తాగునీరు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande