
అమరావతి, 28 మే (హి.స.)
గూడెంకొత్తవీధి మండలం సీలేరు ప్రాంతంలో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. ఇది కదిలే పరిస్థితిలో లేకపోవడంతో ధారకొండ అంబులెన్స్ సహాయంతో తాడు కట్టి పాడేరు గ్యారేజీకు బుధవారం తరలించారు. కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనుల వైద్యసేవల కోసం ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి, అధిక వినియోగం కారణంగా వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ప్రత్యామ్నాయ వాహనాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ