
భద్రాచలం , 07 మే (హి.స.)
భద్రాచలం అటవీశాఖ ఎఫ్డీవో సుజాత, చర్ల ఇన్ఛార్జి డీఆర్వో కృష్ణయ్య ఏసీబీ వలకు చిక్కారు. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రోడ్డు పనుల్లో కొన్ని చెట్లు తొలగించడంతో దానిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఎఫ్డీవో సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. గురువారం రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆమెతోపాటు, చర్ల ఇన్ఛార్జి డీఆర్వో కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ