శ్రీశైలం లో వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం
శ్రీశైలం లో వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం
శ్రీశైలం లో వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం


శ్రీశైలం, 09 మే (హి.స.)

శ్రీశైలంలో సైబర్ మోసం వెలుగు చూసింది. దిల్లీకి చెందిన ఆనంద్కుమార్ శ్రీశైలం మల్లికార్జున సదన్లో 9 ఏసీ గదులను ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ.15 వేలు చెల్లించారు. శనివారం 27 మంది దిల్లీవాసులు హైదరాబాద్ నుంచి ఓ టూరిస్ట్ బస్సులో శ్రీశైలం వచ్చారు. మల్లికార్జున సదన్లో గదుల కోసం సంప్రదించగా అక్కడ గదుల బుకింగ్ జరగలేదని తెలిసింది. దీంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులను లక్ష్యంగా చేసుకొని నకిలీ వెబ్సైట్లతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande