
కరీంనగర్, 09 మే (హి.స.)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ వివాదంతో నేడు కరీంనగర్ నగరం బంద్ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలో స్థానిక మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బందులో పాల్గొనకుండా పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతోపాటు నగరంలోని పలువురు నాయకులు కార్పొరేటర్లను ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకులు సైతం ప్రజలు ఎవరు బంద్ పాటించవద్దని యధావిధిగా వాణిజ్య వ్యాపారాలు కొనసాగించాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..