
అనంతపురం, 09 మే (హి.స.)అనంతపురంలోని కియా మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company). దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థలో అనుబంధ సంస్ధ ఎన్ వి హెచ్ లో పనిచేస్తున్న కార్మికుడు దుర్మరణం చెందాడు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం బోడి శెట్టిపల్లి గ్రామానికి రామాంజనేయులు(22) 6నెలల క్రితం ఎన్.వి.హెచ్ లో ఉద్యోగిగా చేరారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో విధుల్లో నిర్వహిస్తున్న రామాంజనేయులు తలకు యంత్రం తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV