
అమరావతి, 10 జూన్ (హి.స.)
కంభం, ): మార్కాపురం జిల్లాలోని కంభం చెరువు కట్టపై ఓ వైపు సముద్రాన్ని తలపించేలా చెరువు. మరోవైపు పచ్చటి పంటలు ఉంటాయి. విశాలమైన ఈ చెరువుకట్టపై మొదటిసారి వందల మంది స్థానికులతో కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా స్థాయి అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చల్లటి గాలులు, ప్రకృతి రమణీయత నడుమ యోగాసనాలు వేశారు. తమ ఎనలేని అనుభూతిని కలిగించిందని వారు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ