
, 11 జూన్ (హి.స.)
విజయనగరం
తప్పులు లేకుండా కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు ఎన్నికల సంఘం ‘సర్’ కార్యక్రమం చేపట్టిందని ఆర్డీవో సనపాల సుధాసాగర్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 15 నుంచి ఇంటింటికి బీఎల్వోలు వస్తారని, ప్రజలు వారికి సహకరించాలని కోరారు. సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్స్ పరిష్కారం జరుగుతుందని, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను రూపొందిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను బీఎల్వోలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ