ఆంధ్రప్రదేశ్ నుంచి. రాజ్యసభకు టీడీపీ జనసేన నలుగురు అభ్యర్ధులు.ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ నుంచి. రాజ్యసభకు టీడీపీ జనసేన నలుగురు అభ్యర్ధులు.ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ నుంచి. రాజ్యసభకు  టీడీపీ జనసేన నలుగురు అభ్యర్ధులు.ఏకగ్రీవం


అమరావతి, 11 జూన్ (హి.స.)

ంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సమాచారం. టీటీపీ నుంచి సానా సతీశ్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా.. జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు. అయితే, పోటీలో నలుగురు అభ్యర్థులే నిలవడంతో వారి ఎన్నిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో రిటర్నింగ్ అధికారిణి వనిత రాణి ఎన్నికైన అభ్యర్థులకు అధికారికంగా ధృవీకరణ పత్రాలు (ఫారం-22) అందించనున్నారు

ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు జూన్ 1న భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 18న మెుత్తం 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అలాగే పదవీకాలం ముగియకుండానే ఖాళీ అయిన మరో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన.. 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande