
చింతపల్లి, 13 జూన్ (హి.స.)
: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణప్రసాద్ అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. శనివారం ఉదయం మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుడ్ని ఢీకొన్నవ్యాన్ యజమాని బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ