కర్నూలులో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు!
కర్నూలులో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు!
కర్నూలు నగరంలో పూడికతీత పనులు ముమ్మరంగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.


కర్నూలు, 15 జూన్ (హి.స.)

కర్నూలు నగరంలో పూడికతీత పనులు ముమ్మరంగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.

సోమవారం కిడ్స్ వరల్డ్ సర్కిల్, వడ్డేగిరి, బంగారుపేట, గాంధీనగర్, ఆనంద్ టాకీస్ జంక్షన్, సీతారాంనగర్, రామలింగేశ్వర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షం ఎప్పుడు కురిసినా డ్రైనేజీ వ్యవస్థలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా అవసరమైన పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. రూ.2.39 కోట్ల వ్యయంతో 134.28 కిలోమీటర్ల మేర ప్రత్యేక పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande