
బనగానపల్లె, 15 జూన్ (హి.స.)
బనగానపల్లె టిడిపి కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులు. కోవెలకుంట్ల కోర్టు ఏర్పడినప్పటి నుండి బార్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక భవనము లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి తెలియజేశారు.
కోవెలకుంట్ల కోర్టులో 42 మంది బార్ సభ్యులు ఉన్నారని ప్రత్యేక బార్ రూమ్ ను నిర్మించి ఇవ్వవలసిందిగా వినతి పత్రం సమర్పించిన కోవెలకుంట్ల బార్ వైస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపేలు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రమేష్, చంద్రుడు, నాగ శేషు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV