అమావాస్య ఎఫెక్ట్.. స్కూల్ రీఓపెన్ రోజు క్లాస్రూంలో ఒంటరిగా పదో తరగతి విద్యార్థిని
అమావాస్య ఎఫెక్ట్.. స్కూల్ రీఓపెన్ రోజు క్లాస్రూంలో ఒంటరిగా పదో తరగతి విద్యార్థిని
అమావాస్య ఎఫెక్ట్.. స్కూల్ రీఓపెన్ రోజు క్లాస్రూంలో ఒంటరిగా పదో తరగతి విద్యార్థిని


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో చాలా తక్కువ మంది విద్యార్థులపై హాజరయ్యారు. కొన్ని చోట్ల పదుల సంఖ్యలోనే విద్యార్థులు హాజరవ్వగా.. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్లోని బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఒక్కతే పాఠశాలకు వచ్చింది. తోటి క్లాస్మేట్స్ ఎవరూ లేకపోవడంతో ఆ విద్యార్థిని ఒంటరిగానే క్లాస్ రూంలో కూర్చుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ పునఃప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో కొందరు అశుభంగా భావిస్తున్నారు. ఈ రోజున కొత్త పనులు, చదువులు ప్రారంభించడం మంచిది కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రోజుల్లో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈ నెల 17న (బుధవారం), 19న (శుక్రవారం) ప్రారంభించేందుకు నిర్ణయించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande