ఇంటింటికీ ఎమ్మెల్యే కందికుంట.. ప్రజల సమస్యలపై ఆరా!
ఇంటింటికీ ఎమ్మెల్యే కందికుంట.. ప్రజల సమస్యలపై ఆరా!
ఇంటింటికీ ఎమ్మెల్యే కందికుంట.. ప్రజల సమస్యలపై ఆరా!


కదిరి, 16 జూన్ (హి.స.)

:శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 16వ వార్డు బేరిపల్లిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విస్తృతంగా పర్యటించారు.

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణం బేరిపల్లి 16వ వార్డ్ నందు పర్యటించి ఇంటికి ఇంటికి తిరుగుతూ నేరుగా ప్రజలతో మాట్లాడుతూ స్థానిక సమస్యల పై ఆరా తీస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే కందికుంట తోపాటు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు పీ.వి.పవన్ కుమార్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ భర్త టీడీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి సచివాయం సిబ్బందితో కలసి స్థానిక సమస్యల పై ఆరా తీశారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరతగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande