
వరంగల్, 17 జూన్ (హి.స.)
వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చారిత్రక భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంతి కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం దర్శించుకున్నారు. మొదట ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, ఓడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు పవన్. అనంతరం, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ను చూడటానికి వేల సంఖ్యలో భక్తులు, అభిమానులు గుడికి పోటెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..