
కర్నూలు, 19 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్లైన్ వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మే 25 నుంచి జూన్ 4 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు https://www.results.manabadi.co.in/2026/AP/SSC-SUP/mobile/AP-SSC-Supply-2026-Results-18062026.htm ఈ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ను వెంటనే తెలుసుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV