హైదరాబాద్కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
హైదరాబాద్కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
rain


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకోవడంతో పాటు, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది.

సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లలోని నారపల్లి, రాంపల్లి, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, హయత్నగర్, నాగోల్ వంటి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. రాత్రికి నగరం అంతటా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం, పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో నగరంలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు అధిక తేమ నమోదైందని, ఇటువంటి వాతావరణం పరిస్థితులు వర్షాలకు అనుకూలమని నిపుణులు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande