
అమరావతి, 03 జూన్ (హి.స.)
దుంబ్రిగుడ: అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబ్రిగుడ మండలం గొరపుర సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు మండలంలోని కుసుమగుడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ