
నంద్యాల, 05 జూన్ (హి.స.)నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
: నూతనంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుకు వెంట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టిడిపి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి బనగానపల్లె పట్టణంలో రింగ్ రోడ్డు కు ఇరువైపుల ఉపాధి కూలీలతో కలిసి మొక్కలు నాటారు.
భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని రాష్ట్ర రోడ్లు భవనాలవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
వేప, బాదం చింతచెట్టు రోడ్డుకు ఇరువైపులా నాటారు అందరూ మొక్కలు నాటాలి ప్లాస్టిక్ వినియోగాన్ని దూరంగా ఉండాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV