విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం.
విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం.
విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం.


అమరావతి 05 జూన్ (హి.స.)

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పుణ్యక్షేత్రమైన వారణాసికి విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చింది.

ఈ కొత్త విమాన సర్వీసు ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఇండిగో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరిన విమానం, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6:20 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. ప్రయాణ టికెట్ ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్య ఉంటుందని అంచనా.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande