రాజధాని అమరావతి లో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలు భువనేశ్వరితో కలిసి పరిశీలించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి లో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలు భువనేశ్వరితో కలిసి పరిశీలించిన సీఎం చంద్రబాబు
chandra babu


గుంటూరు(రాజధాని), 11 జూలై (హి.స.)

రాజధాని అమరావతి లో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలను సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పరిశీలించారు. వారిద్దరు వెలగపూడిలో నిర్మిస్తున్న తమ సొంత ఇంటి నిర్మాణ పనులను చూసేందుకు వెళ్లారు. సచివాలయం నుం చి ఈ 6 రోడ్డు మీదుగా తమ ఇంటికి చేరుకుని అక్కడ కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం సివిల్ వర్కులు పూర్తై, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. తుది దశకు చేరిన ఈ 6 రోడ్డు పనులు, కనెక్టివిటీ ఉన్న రోడ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అటు నుంచి కోర్ క్యాపిటల్ వైపు ప్రయాణించి అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. తొలుత న్యాయమూర్తుల భవన సముదాయాలను, అనంతరం ఐకానిక్ హైకోర్టు పనులను బయట నుంచే చూశారు. ఆ పక్కనే ఐకానిక్ సెక్రటేరియట్ భవనాల టవర్లను పరిశీలించారు. కారు దిగి వ్యూపాయింట్ వద్దకు వెళ్లి నిర్మాణాలను చూశారు. నిర్మాణ పురోగతిపై ఇంజనీర్లతో మాట్లాడారు. జీఏడీ టవర్ పురోగతిపైనా సీఎం ఆరా తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande