
మణుగూరు, 12 జూలై (హి.స.)
కేంద్ర బొగ్గు గనుల శాఖ
మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులో జరిగే గేట్ మీటింగ్లో పాల్గొననున్నారు. 1985లో మణుగూరు జూనియర్ కాలేజీ విద్యార్థి సంఘం ఎన్నికల సమయంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మణుగూరుకు వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి మణుగూరుకు వస్తున్నారు. ఈ సందర్భంగా పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించి మణుగూరు భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..